Thursday, 30 July 2026 08:28:08 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అటల్ బిహారీ వాజ్ పాయ్ విగ్రహం ఆవిష్కరణ కు భారీగా తరలిరండి

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్ పిలుపు

Date : 07 December 2025 08:00 PM Views : 125

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 07: కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ సారథ్యం సభలని విజయవంతం చేసి కార్యకర్తలను ఉత్సాహపరిచిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణలు చేపట్టబోతున్న కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 వ తారీకున ధర్మవరం లో ప్రారంభమై 14 వ తారీకు ఉదయం మదనపల్లె కదిరి రోడ్ నందు గల అన్నమయ్య సర్కిల్ వద్ద విగ్రహవిష్కరణ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు స్థాయి లోకేష్ అధ్యక్షతన జరగబోతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ , తెలుగుదేశం మరియు జనసేన మంత్రులు అలాగే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ పార్టీ ప్రధాన కార్యదర్శులు సన్నారెడ్డి దయాకర్, నాగోతు రమేష్ నాయుడు, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం , జనసేన నాయకులు స్వచ్ఛందంగా తరలివచ్చి మహానేతకు నివాళులర్పించాలని కోరారు. అనంతరం టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని కూటమి ఐక్యతను తెలియజేసి, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి వాజ్పేయి ప్రధాన మంత్రి గా గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామీణ రోడ్లన్నీ అభివృద్ధి పరిచిన విషయాన్ని , స్వర్ణ చతుర్భుజి ద్వారా జాతీయ రహదారుల్ని అనుసంధానించిన విషయాన్ని , ఉపాధి హామీ ద్వారా అత్యధిక నిధులు ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించిన విషయాన్ని , రైల్వే లను టెలి కమ్యూనికేషన్ వ్యవస్థలను అభివృద్ధిపరిచి , ఐటి ఎదుగుదలకు తోడ్పడిన విధానాన్ని , జాతీయ సమైక్యత వాదాన్ని వినిపించి దేశాన్ని సురక్షితంగా కాపాడి ఉత్తమ విదేశీ విధానంతో ప్రపంచ దేశాలలో భారత దేశం కీర్తిని చాటిన మహానేత, ఫోక్రాన్ అను పరీక్షలు ద్వారా భారత శక్తిని ప్రపంచానికి చూపి అమెరికా ఆంక్షలు సైతం లెక్కచేయకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిన రాజనీతిజ్ఞుడైన అటల్ బిహారి వాజ్పేయి గారిని స్మరించుకోవాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ గోపాల్ రెడ్డి మొలకలచెరువు మండల అధ్యక్షులు పివి జయరాం రెడ్డి బిజెపి జిల్లా కార్యదర్శి శోభారాణి బిజెపి అసెంబ్లీ మాజీ కన్వీనర్ మంగరాజు, సీనియర్ నాయకులు ద్వారకనాథ్ , శివయ్య , గోపి మహేష్ రెడ్డప్ప బాబాసాహెబ్ రవి తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: