నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 10 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని తాహాసిల్దార్ కార్యాలయం గత మూడేళ్లుగా శిధిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన తాసిల్దార్ కార్యాలయం రెండేళ్ల క్రితం పూర్తిగా దెబ్బతిని కూలడానికి సిద్ధమవడంతో తాత్కాలికంగా పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కు మార్చారు. తంబళ్లపల్లె నడిబొడ్డున శిధిలమైన తాసిల్దార్ కార్యాలయం వైపు కన్నీటి చూడకపోవడం దురదృష్టకరం. రెండు ప్రభుత్వాలు మారినా కార్యాలయం పట్టించుకోకపోవడం తోపాటు నిత్యం జిల్లాస్థాయి నుండి డివిజన్ స్థాయి అధికారులు సైతం కార్యాలయం దుస్థితిపై పట్టించుకోక పోవడం విచారకరం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం 2047 విజన్ లో భాగంగా తాసిల్దార్ కార్యాలయం నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు
Reporter
Namitha News