Thursday, 16 April 2026 03:20:08 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మల్లయ్య కొండలను మైనింగ్ పరం చేయకండి

మైనింగ్ కు వ్యతిరేకంగా సంతకాల శేఖరణ

Date : 02 March 2026 08:26 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 02 : తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని పవిత్రమైన సాదు మల్లయ్య కొండలను మైనింగ్ కు అప్పజెప్పరాదని మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ మొట్టమొదటి అన్నదాన కమిటీ ఫౌండర్ ఆదర్శ పాఠశాల చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి , అన్నదాన కమిటీ మొదటి సభ్యుడు అయినటువంటి మెడికల్ స్టోర్ నారాయణరెడ్డి సభ్యులు కోరారు. సోమవారం వారు మల్లయ్య కొండ కింద సమావేశమై లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం సాదు మల్లయ్య కొండ లో వెలసిన మల్లికార్జున స్వామి సంచరించిన ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం మైనింగ్ కు అనుమతి ఇవ్వడం పై వారు ఆక్షేపించారు. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు మల్లయ్య కొండ మహాశివుని దర్శించుకుంటారని మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారని అలాంటి మహాన్విత మల్లికార్జున స్వామి కొండలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కొండలను కాపాడుకోవడానికి మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సంతకాల సేకరణ లో ప్రతి ఒక్కరూ పాల్గొని మల్లయ్య కొండలను కాపాడుకోవడానికి ముందుకు రావాలని కోరారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :