నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 02 : తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని పవిత్రమైన సాదు మల్లయ్య కొండలను మైనింగ్ కు అప్పజెప్పరాదని మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ మొట్టమొదటి అన్నదాన కమిటీ ఫౌండర్ ఆదర్శ పాఠశాల చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి , అన్నదాన కమిటీ మొదటి సభ్యుడు అయినటువంటి మెడికల్ స్టోర్ నారాయణరెడ్డి సభ్యులు కోరారు. సోమవారం వారు మల్లయ్య కొండ కింద సమావేశమై లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం సాదు మల్లయ్య కొండ లో వెలసిన మల్లికార్జున స్వామి సంచరించిన ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం మైనింగ్ కు అనుమతి ఇవ్వడం పై వారు ఆక్షేపించారు. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు మల్లయ్య కొండ మహాశివుని దర్శించుకుంటారని మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారని అలాంటి మహాన్విత మల్లికార్జున స్వామి కొండలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కొండలను కాపాడుకోవడానికి మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సంతకాల సేకరణ లో ప్రతి ఒక్కరూ పాల్గొని మల్లయ్య కొండలను కాపాడుకోవడానికి ముందుకు రావాలని కోరారు.
Reporter
Namitha News