నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 10 : రామసముద్రం మండలం లోని పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ తిరుమలరెడ్డిపల్లె గ్రామం లో క్షయవ్యాధి పై శుక్రవారం సూపర్ వైజర్ పద్మజ సి హెచ్ ఓ ఉమాదేవి అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు.ఆమె మాట్లాడుతూ క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్షయ లక్ష్మణాలు, నివారణకు తీసుకోవాల్సి జాగ్రత్తలను క్లుప్తంగా వివరించారు. క్షయ వ్యాధి గ్రస్తులు బయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా స్నానం చేసి డాక్టర్ ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడితే జబ్బు తగ్గుతుందన్నారు.మన పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలని ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో సూపర్ వైజర్ పద్మజ, సి హెచ్ ఓ ఉమాదేవి,ఎ ఎన్ ఎం గీతారాణి, గౌతమి, భానుప్రియ, శివశంకర, తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News