Thursday, 30 July 2026 05:33:18 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

12న మదనపల్లిలో జరిగే వైయస్సార్సీపి ర్యాలీని విజయవంతం చేయండి

ముఖ్యఅతిథిగా హాజరు కానున్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

Date : 10 November 2025 07:01 PM Views : 361

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : అన్నమయ్య జిల్లా మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణకి వ్యతిరేకంగా ఈనెల 12న మదనపల్లిలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని రామసముద్రం మండల వైసీపీ కన్వీనర్ కేశవరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం వైఎస్ఆర్సిపి తలపెట్టే ర్యాలీని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు. గత వైసిపి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలను ప్రారంభించడం జరిగిందన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారి ఉన్నత భవిష్యత్తు కోసం మెడికల్ కళాశాలలను స్థాపించారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేలా చర్యలు తీసుకుందన్నారు. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర ఆటంకం కలిగిందని మండిపడ్డారు. దీనిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే నిర్వహిస్తున్న రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్యస్పందన వస్తుందని పేర్కొన్నారు. చిత్తూరు బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుందని, ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరవుతున్నట్లు కేశవరెడ్డి తెలియజేశారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :