నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 08 ః తంబళ్లపల్లె మండల అభివృద్ధికి మండల స్థాయి అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది కలిసి రావాలని తంబళ్లపల్లె ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో పంచాయతీల అభివృద్ధి పనులు నిర్వహణ, పెన్షన్లు పంపిణీ, పారిశుద్ధ్యం, స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ భారతి, జలధార-జల హారతి లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వివరాలు, వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాల పనితీరు, రుణాల పంపిణీ సద్వినియోగం, వ్యవసాయం, రైతు భరోసా, భూముల రీ సర్వే, రైతుల సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం, సచివాలయాల పనితీరు పై ఆరా తీశారు. సచివాలయాల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కారానికి ముందు ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదే విధంగా జల సంరక్షణ లో భాగంగా జలధార, జలహారతి కార్యక్రమాల ద్వారా ప్రతి ఉపాధి కూలికి పని కల్పించి వలసల నివారణకు సహకరించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఎంపీ ప్రసాద్, ఎంఈఓ త్యాగరాజు, ఏఈలు వినోద్ కుమార్, రమణ, సుజాత, ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, రెవెన్యూ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు
Reporter
Namitha News