Saturday, 13 June 2026 09:04:36 AM
# ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు # తంబళ్లపల్లెలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై ర్యాలీ # తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు # తంబళ్లపల్లెలో యోగాంద్ర విజయవంతం చేయండి - ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ # మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం # ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు - తృటిలో తప్పిన పెను ప్రమాదం # ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ # ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మిట్స్ విద్యార్థులు # మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు # మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం # తంబళ్లపల్లె లో 90వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలపరిశీలన # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్ # ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు # పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం # మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్ # ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన # రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్ # కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి

Date : 08 June 2026 08:38 PM Views : 88

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 08 ః తంబళ్లపల్లె మండల అభివృద్ధికి మండల స్థాయి అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది కలిసి రావాలని తంబళ్లపల్లె ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో పంచాయతీల అభివృద్ధి పనులు నిర్వహణ, పెన్షన్లు పంపిణీ, పారిశుద్ధ్యం, స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ భారతి, జలధార-జల హారతి లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వివరాలు, వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాల పనితీరు, రుణాల పంపిణీ సద్వినియోగం, వ్యవసాయం, రైతు భరోసా, భూముల రీ సర్వే, రైతుల సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం, సచివాలయాల పనితీరు పై ఆరా తీశారు. సచివాలయాల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కారానికి ముందు ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదే విధంగా జల సంరక్షణ లో భాగంగా జలధార, జలహారతి కార్యక్రమాల ద్వారా ప్రతి ఉపాధి కూలికి పని కల్పించి వలసల నివారణకు సహకరించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఎంపీ ప్రసాద్, ఎంఈఓ త్యాగరాజు, ఏఈలు వినోద్ కుమార్, రమణ, సుజాత, ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, రెవెన్యూ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :