Wednesday, 29 July 2026 01:32:34 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రెండేళ్ల పాలనపై జరిగిన అభివృద్ధి నివేదికలు నివేదించండి - స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి

Date : 22 June 2026 10:03 PM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 22 ః తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల అధికారులు ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రణాళిక నివేదికలను సిద్ధం చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి తంబళ్లపల్లె స్పెషలాఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆరు మండలాల మండల స్థాయి అధికారులు తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జలధార-జల హారతి నిర్వహణ, పండ్ల తోటల పెంపకం, తల్లికి వందనం, పాఠశాలల స్థితిగతులు,విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ వివరాలు, రైతుభరోసా, విత్తన కాయల పంపిణీ, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ పరికరాలు పంపిణీ వివరాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు పంపిణీ, కొత్త పెన్షన్లకు వచ్చిన దరఖాస్తుల వివరాలు, మండలంలో తాగునీరు కోసం జలజీవన్ మిషన్ పనుల నిర్వహణ వివరాలు, 20 47 విజన్ లో నియోజకవర్గానికి మంజూరైన పనులు చేసిన అభివృద్ధి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ సిలిండర్, గ్రామాల్లో సిసి రోడ్లు, మురికినీటి కాలువలు, తారు రోడ్లు వివరాలు, వెలుగు లో మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ వివరాలు, ఐసిడిఎస్ లో పిల్లలకు పౌష్టికాహార పంపిణీ, ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి పనుల వివరాలు, ఎన్టీఆర్ వైద్య సేవ, 108, 104 సేవలు, ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ తో పాటు అభివృద్ధి, సంక్షేమ ప్రణాళిక నివేదికలు సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పెతేరు ప్రాజెక్ట్ డిఈ చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీడీవో ఉషారాణి, ఎంఈఓ త్యాగరాజు, డిప్యూటీలు ఎం వి ప్రసాద్, మారుతీ కుమార్, ఏపిఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, ఏఈఈ వినోద్ కుమార్, సతీష్, వెంకటరమణ, సుజాత, నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీడీవోలు, పలు శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :