నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 22 : కురబలకోట మండలంలో జరిగిన కురబ సంఘ ఎన్నికలలో తంబళ్లపల్లె మండలం కురవ సంఘం అధ్యక్షుడిగా ఎర్రసానిపల్లి కు చెందిన సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. శుక్రవారం తంబళ్లపల్లె టిడిపి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి పూలహారాలు, దుశ్యాలవులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, రామచంద్ర, నరసింహులు, మ్యూజికల్ శివ,మధునాయుడు,గంగుల రెడ్డి,కాలా నారాయణ, పెద్ద వీరభద్ర, కసెట్టి వెంకటరమణ, నరేంద్ర, శ్రీనివాసులు, జయచంద్ర పాల్గొన్నారు
Reporter
Namitha News