నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 15 : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజక వర్గం లోని రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ ఎగువ దిన్నిమీద హరిజనవాడలో నూతనంగా నిర్మించిన నల్లగంగమ్మ, కుంటి గంగమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ టేకుపల్లి శ్రీనివాసులు హాజరయ్యారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామస్థులు హేమవతి, టేకుపల్లి శ్రీనివాసులు దంపతులను దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగప్ప, శంకర, సుధా, నారాయణ, రవి, ఆలయ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News