నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా నాదెళ్ల విద్యాసాగర్,మదనపల్లె 2వ డిపో అధ్యక్షులుగా జోలిపాలెం దేవేంద్రబాబు (చిన్ని) శనివారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. మదనపల్లె పట్టణంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పి.వి. రమణ రెడ్డి, కడప జోనల్ అధ్యక్షులు పి. వినోద్ కుమార్, కడప జోనల్ సెక్రటరీ చెన్న రెడ్డి, జిల్లా సెక్రటరీ పి.ఎస్. రాజు, పీలేరు అధ్యక్షులు రెడ్డప్ప రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, సంస్థ బలోపేతం దిశగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ప్రజలతో నిత్యం మమేకమై సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. నూతన జిల్లా అధ్యక్షులు నాదెళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ, తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, జిల్లా వ్యాప్తంగా సంస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. అలాగే మదనపల్లి 2వ డిపో అధ్యక్షులు జోలిపాలెం దేవేంద్రబాబు (చిన్ని) మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను గుర్తించి, న్యాయసమ్మతమైన పరిష్కారాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. సభా ప్రాంగణం నినాదాలతో మార్మోగగా, కార్యక్రమం సౌహార్ద్ర వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
Reporter
Namitha News