నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్10: స్వదేశీ వస్తువులను కొనండి... దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడండి. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను 99 శాతం వస్తువులపై ఐదు శాతం కన్నా తక్కువ పన్ను బడుగు,బలహీన,మహిళా, రైతాంగ, యువత మరియు మగతరగతి ప్రజలకు లబ్ధి ప్రతి కుటుంబానికి ఏడాదికి 15,000 వేల రూపాయలు లబ్ధి చేకూరేలా పన్నులో మార్పులు దేశం తో పాటు ప్రతి ప్రాంత అభివృద్ధి లక్ష్యం పేదరిక నిర్మూలన, దేశ ప్రజల పొదుపు వారి యొక్క ఆర్థిక భద్రతే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం అని స్వదేశీ వస్తువులను కొని దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని భారతీయ జనతా పార్టీ రాయలసీమ కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జ్ ఓసూరి కిరణ్ కుమార్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ పై స్పందిస్తూ మొదట జి ఎస్టి పై కొత్త సంస్కరణలను తీసుక వచ్చిన మోదీ కి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్ధం పన్నులో మార్పులు చేపట్టడం శుభపరిణామం అన్నారు.నూతన జీఎస్టీ విధానం వల్ల బడుగు, బలహీన,మహిళా, రైతాంగ, యువత మరియు మగతరగతి ప్రజలకు లబ్ధి చేకూరేలా 99 శాతం వస్తువుల కొనుగోలు పై ఐదు శాతం కన్నా తక్కువగా పన్ను తగ్గించడం జరిగిందని గుర్తు చేశారు. తద్వారా సామాన్యులకు ఆర్థిక భారం తగ్గి ప్రతి ఏటా కుటుంబానికి సుమారు 15వేల రూపాయల ఆదాయం చేకూరుతుందన్నారు. దీని ద్వారా దేశంతో పాటు ప్రతి ప్రాంతం త్వరగా వృద్ధి చెందుతాయన్నారు. ప్రతి చిన్న వ్యాపారస్తులకు మేలు జరిగేలా MSME సబ్సిడీతో కూడిన రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతిపిత మహాత్మా గాంధీ స్పూర్తితో ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు, విక్రయాలు జరపాలని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.
Reporter
Namitha News