Thursday, 30 July 2026 01:32:10 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పేదరిక నిర్మూలన, దేశ ప్రజల పొదుపు వారి యొక్క ఆర్థిక భద్రతే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం

భారతీయ జనతా పార్టీ రాయలసీమ కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జ్ ఓసూరి కిరణ్ కుమార్

Date : 10 November 2025 11:38 AM Views : 345

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్10: స్వదేశీ వస్తువులను కొనండి... దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడండి. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను 99 శాతం వస్తువులపై ఐదు శాతం కన్నా తక్కువ పన్ను బడుగు,బలహీన,మహిళా, రైతాంగ, యువత మరియు మగతరగతి ప్రజలకు లబ్ధి ప్రతి కుటుంబానికి ఏడాదికి 15,000 వేల రూపాయలు లబ్ధి చేకూరేలా పన్నులో మార్పులు దేశం తో పాటు ప్రతి ప్రాంత అభివృద్ధి లక్ష్యం పేదరిక నిర్మూలన, దేశ ప్రజల పొదుపు వారి యొక్క ఆర్థిక భద్రతే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం అని స్వదేశీ వస్తువులను కొని దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని భారతీయ జనతా పార్టీ రాయలసీమ కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జ్ ఓసూరి కిరణ్ కుమార్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ పై స్పందిస్తూ మొదట జి ఎస్టి పై కొత్త సంస్కరణలను తీసుక వచ్చిన మోదీ కి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్ధం పన్నులో మార్పులు చేపట్టడం శుభపరిణామం అన్నారు.నూతన జీఎస్టీ విధానం వల్ల బడుగు, బలహీన,మహిళా, రైతాంగ, యువత మరియు మగతరగతి ప్రజలకు లబ్ధి చేకూరేలా 99 శాతం వస్తువుల కొనుగోలు పై ఐదు శాతం కన్నా తక్కువగా పన్ను తగ్గించడం జరిగిందని గుర్తు చేశారు. తద్వారా సామాన్యులకు ఆర్థిక భారం తగ్గి ప్రతి ఏటా కుటుంబానికి సుమారు 15వేల రూపాయల ఆదాయం చేకూరుతుందన్నారు. దీని ద్వారా దేశంతో పాటు ప్రతి ప్రాంతం త్వరగా వృద్ధి చెందుతాయన్నారు. ప్రతి చిన్న వ్యాపారస్తులకు మేలు జరిగేలా MSME సబ్సిడీతో కూడిన రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతిపిత మహాత్మా గాంధీ స్పూర్తితో ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు, విక్రయాలు జరపాలని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :