Sunday, 13 September 2026 02:49:25 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం

Date : 17 April 2026 07:52 PM Views : 196

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోసియం “టెరా-2కె26” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2006–2010 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి, ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. శ్రీధర్ పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్ నాథన్, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ కఠోర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదలతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. నూతన ఆలోచనలతో ముందుకు సాగుతూ పరిశ్రమలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సు ఎప్పటికీ ‘ఎవర్‌గ్రీన్’ అని పేర్కొంటూ, పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర విద్యుత్ శాఖలు, రైల్వేలు, డిఫెన్స్, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ప్రైవేట్ రంగంలో ఎలక్ట్రికల్ డిజైన్, మెయింటెనెన్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి విభాగాల్లో అవకాశాలు ఉన్నాయని వివరించారు. రిన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్మార్ట్ గ్రిడ్స్ వంటి ఆధునిక రంగాల్లో అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని, కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికతలను నేర్చుకుంటే మరింత మంచి కెరీర్ సాధ్యమవుతుందని తెలిపారు. సరైన సాంకేతిక నైపుణ్యాలు, ప్రాక్టికల్ అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఉద్యోగాలు పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్ నాథన్, డీన్ డాక్టర్ దీపాంకర్ రాయ్, అసిస్టెంట్ డీన్ డాక్టర్ ఏ.వి. పవన్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ మనవాళన్ గుణశేఖరన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :