నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 16 : మండలంలోని గంగిరెడ్డిపల్లి లో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో గంగిరెడ్డిపల్లి జట్టు విజేతగా నిలిచినట్లు టిడిపి సీనియర్ నేత భాస్కర్ నాయుడు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ లో రేఖలకుంట తాండ జట్టుపై గంగిరెడ్డిపల్లి జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్ విజేతకు భాస్కర్ నాయుడు ఐదువేలు నగదు తో పాటు ట్రోఫీ, రన్నర్ జట్టుకు మూడు వేలు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా క్రికెట్ క్రీడాకారులను అభినందించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత దుర్వెసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులతో పాటు జన్మభూమి, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గంగిరెడ్డిపల్లెలో తరచూ క్రీడలను ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తున్న భాస్కర్ నాయుడును యువ క్రీడాకారులు, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మస్తాన్ రెడ్డి, చాంద్ భాషా, చంద్రశేఖర్ నాయుడు, పంచాయతీలోని క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News