Monday, 20 April 2026 04:24:26 PM
# జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసైనికుడు రాయల్ కుమార్ # జాతీయ స్థాయీ టెక్నికల్ సింపోసియం ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు # పోలీసులు చేసిన సేవ అభినందనీయం - యస్.ఐ. అనిల్ కుమార్ # అభివృద్ధి పనులతో కోసువారిపల్లి పరుగులు - బేరిపల్లి శ్రీనివాసులు # ముగిసిన క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కబడ్డీ పోటీలు -- విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీల ప్రదానం # యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు # యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు # అమ్మ చెరువు మిట్ట వద్ద రోడ్డు ప్రమాదం, తండ్రీ బిడ్డ మృతి # మిట్స్ లో ఘనంగా అన్యూవల్ డే # నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్దేశకులు # మహిళా బిల్లు ఆమోదం పొందలేకపోవడం దురదృష్టకరం # ఉపాధి హామీ పనుల వేగం పెంచండి - డ్వామా పిడి వెంకటరత్నం # ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అనిల్ చంద్ర పునేఠా # రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి –జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్

జాతీయ స్థాయీ టెక్నికల్ సింపోసియం ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు

Date : 19 April 2026 10:59 PM Views : 13

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 19 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్న సి.దినేష్, జయంత్ .ఆర్, పృథ్వినాథ్ రెడ్డి.ఏ, బి.రంజిత్ కుమార్, కార్తీక్ ల విద్యార్థుల బృందం జాతీయ స్థాయీ టెక్నికల్ సింపోసియం కార్యక్రమంలో మొదటి బహుమతి సాధించి ప్రతిభ కనపరిచినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. తిరుపతిలోని ఎస్.వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నికల్ సింపోసియం “ఈ-బ్లేజ్" కార్యక్రమంలో కోల్డ్ స్టోరేజ్‌లలో శక్తి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు సోలార్ మరియు విండ్ ఎనర్జీ వినియోగంపై రూపొందించిన తమ వినూత్న ప్రాజెక్టును ప్రదర్శించి, మొదటి బహుమతి మరియు ప్రశంశ పత్రాలను అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలను నిర్వహించడానికి ఈ పరిష్కారం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును డాక్టర్ టి. బాలాజీ మార్గదర్శకత్వంలో విద్యార్థులు రూపొందించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, విభాగాధిపతి డాక్టర్ మణివలన్ గుణశేఖరన్, ఏ.వి పవన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :