Sunday, 13 September 2026 11:58:06 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

సోన మసూరి బియ్యం రకానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ కు దరఖాస్తు

Date : 22 March 2026 04:21 PM Views : 327

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 22 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ వారు అనంతపురము సోన మసూరి బియ్యం రకానికి భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడిందని వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. యూనివర్సిటీ లోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మద్దతుతో ఈ దరఖాస్తు సమర్పించబడిందని ఆయన తేలిపారు. అనంతపురము జిల్లాకు ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు—తక్కువ వర్షపాతం కలిగిన అధిక ఎండ ప్రాంత వాతావరణం, ఎర్రటి ఇసుక మట్టి మరియు తక్కువ నీటి నిల్వ సామర్థ్యం గల నేలలు, అధిక ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఇక్కడ పండే సోన మసూరి బియ్యానికి ప్రత్యేకమైన నాణ్యత లక్షణాలు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ బియ్యం మెరుస్తున్న బంగారు-పసుపు రంగు, గట్టి గింజ నిర్మాణం, అద్భుతమైన వంట నాణ్యత మరియు మంచి వాసనతో ప్రత్యేక గుర్తింపు పొందింది అని అన్నారు. ఈ ప్రత్యేకతను రక్షించేందుకు అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ, చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీకి GI దరఖాస్తును MITS-IPFC సంస్థ సాంకేతిక, విధానపరమైన సహాయాన్ని అందించింది. జి.ఐ ట్యాగ్ గుర్తింపు లభించడం ద్వారా ఉత్పత్తి పేరును దుర్వినియోగం కాకుండా కాపాడటంతో పాటు రైతులకు న్యాయమైన ధరలు, మార్కెట్ నమ్మకం మరియు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వాణిజ్య విలువ పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ రిజిస్ట్రేషన్‌కు దోహదపడిన అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ, అనంతపూర్, మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ వారి ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్&డి) డాక్టర్ పి.శివయ్య మరియు తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :