Monday, 02 March 2026 06:50:44 AM
# ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు # విద్యా పర్యటన లో ఏపీ శాసనసభ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లె లో 30 వేల జనసేన సభ్యత్వమే మా లక్ష్యం -మైఫోర్స్ మహేష్ # తంబళ్లపల్లె లో ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ సభ # చెట్టు పై నుండీ పడి రైతు కు గాయాలు # చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # కనబడకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య # తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ? # గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు పంపిణీ # తంబళ్లపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 93.44% పంపిణీ # మార్చి 5వ తేదీలోగా 100% ఇండ్ల పన్ను వసూలు చేయాలి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు # ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ # ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్ # మిట్స్ లో ఘనంగా స్మృతి సంగమం-2026 # మిట్స్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే # మెడికల్ మాఫియా ను అరికట్టాలంటూ డి.యం.హెచ్.ఓ. కార్యాలయం వద్ద సిపిఐ నిరసన # శ్రీరామ్ చినబాబు కు అభినందనల వెల్లువ # విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో CSE & AI & DS విభాగాల ఆధ్వర్యంలో వర్క్‌షాప్ # కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

మిట్స్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే

Date : 28 February 2026 08:38 PM Views : 21

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 28 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎన్.ఎస్.ఎస్. విభాగం వారి ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్. చంద్రశేఖర్, యెన్.ఎస్.ఎస్ ఆఫీసర్ రాజేష్ లు సర్ సీవి రామన్ చిత్ర పటానికి పూలమాల వేసి ఆయన ను స్మరించుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ డి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్ సీవి రామన్ అగ్రగణ్యుడు అని, ప్రతిష్టాత్మక దేశ పౌర పురస్కారం భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం అని అన్నారు. ఈ దినము మన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ ప్రపంచానికి తెలిసిన రోజు గా పరిగణిస్తామని, వైజ్ఞానిక రంగంలో నొబెల్ అందుకున్న దేశం మనదే అని అన్నారు. విజ్ఞానం కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదని, అది మన జీవితాన్ని మార్చగల శక్తి అని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నించే మనసు, పరిశోధించే తత్వం, సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగగలడని ఆయన అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత, పునరుత్పాదక శక్తి వనరులు వంటి రంగాలలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, యువత తమ ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించాలని తెలిపారు. నేషనల్ సైన్స్ డే సందర్బంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంశ పత్రాలను మరియు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :