నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 28 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎన్.ఎస్.ఎస్. విభాగం వారి ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్. చంద్రశేఖర్, యెన్.ఎస్.ఎస్ ఆఫీసర్ రాజేష్ లు సర్ సీవి రామన్ చిత్ర పటానికి పూలమాల వేసి ఆయన ను స్మరించుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ డి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్ సీవి రామన్ అగ్రగణ్యుడు అని, ప్రతిష్టాత్మక దేశ పౌర పురస్కారం భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం అని అన్నారు. ఈ దినము మన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ ప్రపంచానికి తెలిసిన రోజు గా పరిగణిస్తామని, వైజ్ఞానిక రంగంలో నొబెల్ అందుకున్న దేశం మనదే అని అన్నారు. విజ్ఞానం కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదని, అది మన జీవితాన్ని మార్చగల శక్తి అని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నించే మనసు, పరిశోధించే తత్వం, సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగగలడని ఆయన అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత, పునరుత్పాదక శక్తి వనరులు వంటి రంగాలలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, యువత తమ ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించాలని తెలిపారు. నేషనల్ సైన్స్ డే సందర్బంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంశ పత్రాలను మరియు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News