నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - జులై 01 : రోగుల ప్రాణాలను కాపాడటంతో వైద్యుల కృషి అజరామరమని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కె బాషా అన్నారు. మానవ రూపంలోని దేవుడిలా రోగులకు సేవలు అందించే దేవుళ్లు వైద్యులని గుర్తు చేశారు. మానవసేవే మాధవసేవ గా వైద్య వృత్తి సేవానిరతి తో నిర్వహించడం జరుగు తుందన్నారు. వైద్యుల కోసం ప్రపంచ మంతా ఒక్కరోజు కేటాయించింది. అదే ప్రపంచ డాక్టర్స్ డే, వాళ్లను గుర్తుపెట్టుకుని ఈ రోజున డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. మన దేశంలో ప్రతియేటా జూలై 1న డాక్టర్స్ డే గా జరుపు కొంటున్నాం. మన దేశంలో వైద్యారంగానికి ఎనలేని సేవలించిన బీసీ రాయ్ గౌరవార్ధం ఆయన జయంతిని డాక్టర్స్ డే పాటిస్తున్నారు. డాక్టర్ బీసీరాయ్ పుట్టిన రోజు, మరణించిన రోజు జూలై ఒకటోతేదీ కావటం విశేషం. ఎంతో మహోన్నతమైన డాక్టర్ బీసీరాయ్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్స్ డే గా జరుపుకోవడం అభినందనీయం
Admin
Namitha News