నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 15 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో భేటీ బచావో బేటి పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సుజాత, సూపర్వైజర్ రమణమ్మ లు మాట్లాడుతూ ఆడపిల్లలు చదువు ఇంటికి వెలుగు ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని ఆడపిల్లలకు చదివే జీవితం ఒక ఆడబిడ్డ చదువుకుంటే కుటుంబమంతా విద్యావంతులు అవుతారని హితవు పలికారు. బాలికలు చదువుతోపాటు పరిశుభ్రత, గుడ్ టచ్ బాడ్ టచ్ లపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆడపిల్లలు చదువుతోపాటు చట్టం పై అవగాహన తో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.
Reporter
Namitha News