నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 30 : తంబళ్లపల్లె మండల ఇన్చార్జ్ ఎంపీడీవో గా డిప్యూటీ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ ని నియమించినట్లు జిల్లా సీఈవో నుండి కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. ఇక్కడ పనిచేస్తున్న ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ పదవీ విరమణ పొందడంతో డిప్యూటీ ఎంపీడీవో ఎంపీ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 21 పంచాయతీలు 12 సచివాలయాలు అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికార కూటమి పార్టీల నాయకుల సహకారంతో మండలాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆయనను ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, సీనియర్ అసిస్టెంట్ గోపీనాథ్, టైపిస్ట్ సురేంద్ర, జూనియర్ అసిస్టెంట్ విజయ్, ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, పురుషోత్తం, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది అభినందించి ఘనంగా స్వాగతించారు
Reporter
Namitha News