Wednesday, 29 July 2026 12:26:59 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

కరువు ప్రాంతంలో జలధార జల సంరక్షణ చర్యలు ప్రశంసనీయం - కడ స్పెషల్ కమిషనర్ ప్రశాంతి

స్పష్టమైన ప్రణాళిక, సమిష్టి కృషితో జలధార ప్రాజెక్టు విజయవంతం - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 31 March 2026 06:23 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 31: కరువు ప్రభావిత ప్రాంతమైన అన్నమయ్య జిల్లాలో స్పష్టమైన ప్రణాళిక, శాఖల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో జలధార ప్రాజెక్టు విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మంగళవారం మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) స్పెషల్ కమిషనర్ పి. ప్రశాంతి ఆధ్వర్యంలో జిల్లాలో జలధార ప్రాజెక్టు అమలును అధ్యయనం చేయడానికి వచ్చిన కడ అధికారులు, జేఎన్‌టీయూ ప్రొఫెసర్ల బృందం కలెక్టర్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ, జిల్లాలో జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, కాలువల శుద్ధి, నీటి మళ్లింపు వంటి చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. ఈ చర్యల వల్ల వ్యవసాయానికి నీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాల స్థాయి మెరుగుపడిందని, జలధార కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను అమలు చేసి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా లేబర్ బడ్జెట్‌ను నీటి సంరక్షణ పనులకు వినియోగించడం వల్ల భూగర్భ జలాలు పెరిగి పచ్చదనం, పశుగ్రాసం లభించిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. జలధార ప్రాజెక్టు విజయాన్ని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారికి వివరించగా, ముఖ్యమంత్రి మరియు సీఎస్ గారి ప్రశంసలు అందుకోవడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు

కడ స్పెషల్ కమిషనర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్టు అమలు తీరుపై ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. విజయనగరం, బాపట్ల జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు మరియు కడ అధికారులతో కలిసి రైల్వేకోడూరు, చిట్వేలు, పుల్లంపేట, రాజంపేట, మదనపల్లి ప్రాంతాల్లో పర్యటించి అధ్యయనం చేసిన విషయాలను ప్రభుత్వానికి నివేదికగా సమర్పిస్తామని తెలిపారు. ఈ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు డ్వామా పీడీ వెంకటరత్నం ఆధ్వర్యంలో జలధార ప్రాజెక్టు కింద చేపట్టిన నీటి సంరక్షణ చర్యలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కలెక్టర్, కడ స్పెషల్ కమిషనర్ మరియు వారి బృందం పరిశీలించారు

ఈ సమావేశంలో జల వనరుల శాఖ ఎస్‌ఈ విఠల్ ప్రసాద్, డ్వామా పీడీ వెంకటరత్నం, పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్ళైతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: