Monday, 08 June 2026 09:51:50 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

కరువు ప్రాంతంలో జలధార జల సంరక్షణ చర్యలు ప్రశంసనీయం - కడ స్పెషల్ కమిషనర్ ప్రశాంతి

స్పష్టమైన ప్రణాళిక, సమిష్టి కృషితో జలధార ప్రాజెక్టు విజయవంతం - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 31 March 2026 06:23 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 31: కరువు ప్రభావిత ప్రాంతమైన అన్నమయ్య జిల్లాలో స్పష్టమైన ప్రణాళిక, శాఖల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో జలధార ప్రాజెక్టు విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మంగళవారం మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) స్పెషల్ కమిషనర్ పి. ప్రశాంతి ఆధ్వర్యంలో జిల్లాలో జలధార ప్రాజెక్టు అమలును అధ్యయనం చేయడానికి వచ్చిన కడ అధికారులు, జేఎన్‌టీయూ ప్రొఫెసర్ల బృందం కలెక్టర్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ, జిల్లాలో జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, కాలువల శుద్ధి, నీటి మళ్లింపు వంటి చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. ఈ చర్యల వల్ల వ్యవసాయానికి నీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాల స్థాయి మెరుగుపడిందని, జలధార కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను అమలు చేసి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా లేబర్ బడ్జెట్‌ను నీటి సంరక్షణ పనులకు వినియోగించడం వల్ల భూగర్భ జలాలు పెరిగి పచ్చదనం, పశుగ్రాసం లభించిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. జలధార ప్రాజెక్టు విజయాన్ని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారికి వివరించగా, ముఖ్యమంత్రి మరియు సీఎస్ గారి ప్రశంసలు అందుకోవడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు

కడ స్పెషల్ కమిషనర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్టు అమలు తీరుపై ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. విజయనగరం, బాపట్ల జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు మరియు కడ అధికారులతో కలిసి రైల్వేకోడూరు, చిట్వేలు, పుల్లంపేట, రాజంపేట, మదనపల్లి ప్రాంతాల్లో పర్యటించి అధ్యయనం చేసిన విషయాలను ప్రభుత్వానికి నివేదికగా సమర్పిస్తామని తెలిపారు. ఈ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు డ్వామా పీడీ వెంకటరత్నం ఆధ్వర్యంలో జలధార ప్రాజెక్టు కింద చేపట్టిన నీటి సంరక్షణ చర్యలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కలెక్టర్, కడ స్పెషల్ కమిషనర్ మరియు వారి బృందం పరిశీలించారు

ఈ సమావేశంలో జల వనరుల శాఖ ఎస్‌ఈ విఠల్ ప్రసాద్, డ్వామా పీడీ వెంకటరత్నం, పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్ళైతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :