నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 25 : అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎస్. నిసార్ అహమద్, వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి శ్రీ వి.ఎస్. రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్. నిసార్ అహమద్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రత్యక్షంగా ఎన్యూమరేషన్ నిర్వహించాల్సి ఉండగా, కొందరు బీఎల్వోలు ప్రజలను సచివాలయాలకు రమ్మని ఒత్తిడి తెస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి పరిస్థితులను నివారించేందుకు బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించిన సమయంలో తప్పనిసరిగా జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. తద్వారా సర్వే నిజంగా ఇంటి వద్దే జరిగిందని నిర్ధారించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం రైతులు, వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో, ప్రజలకు అనుకూలమైన సమయాల్లోనే ఇంటింటి సర్వే చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని కోరారు. వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల జాబితాల పరిశీలనలో కీలకమైన DSE (Demographically Similar Entries) జాబితాను అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని కోరారు. తద్వారా రాజకీయ పార్టీలు కూడా జాబితాలను పరిశీలించి, నిజమైన ఓటర్ల హక్కులు పరిరక్షించేందుకు సహకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు
Reporter
Namitha News