నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 03 : : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమానికి రైతుల నుండి విశేష స్పందన లభిస్తున్నట్లు తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం జుంజురపెంట, ఆర్ ఎన్ తాండ పంచాయతీలకు సంబంధించిన రైతులకు తాసిల్దార్ పాసుబుక్కులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రీ సర్వేలో ఏర్పడిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించి పక్కా ప్రణాళిక ప్రకారం పాసుబుక్కుల పంపిణీ జరుగుతుందన్నారు. పాస్ బుక్కులు ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వ్యవసాయ పరికరాలు, అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని సూచించారు. నూతన పాస్ బుక్కుల పంపిణీ పై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో శ్రీరాములు, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.కూటమి నాయకులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమానికి రైతుల నుండి విశేష స్పందన లభిస్తున్నట్లు తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం జుంజురపెంట, ఆర్ ఎన్ తాండ పంచాయతీలకు సంబంధించిన రైతులకు తాసిల్దార్ పాసుబుక్కులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రీ సర్వేలో ఏర్పడిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించి పక్కా ప్రణాళిక ప్రకారం పాసుబుక్కుల పంపిణీ జరుగుతుందన్నారు. పాస్ బుక్కులు ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వ్యవసాయ పరికరాలు, అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని సూచించారు. నూతన పాస్ బుక్కుల పంపిణీ పై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో శ్రీరాములు, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News