నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రైవేట్ స్థలంలో ఆలయ నిర్మాణం.. పరిస్థితి ఉద్రిక్తం..... సమయమనం పాటించండి ఇరు వర్గాలను హెచ్చరించిన వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీ.... మదనపల్లి మున్సిపల్ పరిధిలో ని నెమలి నగర్ వడ్డిపల్లి లో బోయకొండ గంగమ్మ దేవాలయాన్ని కొందరు వ్యక్తులు తొలగించారని గ్రామస్తులు నిరసన చేపట్టారు.. సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు ప్రైవేటు స్థలంలో ఆలయం నిర్మాణం చేపట్టడం తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసిందని , ఇరు వర్గాలు సమయమనం పాటించాలని సూచించారు.. భూమి యజమాని కొద్ది కాల క్రితం మృతి చెందడంతో తన భర్త పేరు మీద ఉన్న ఆస్తిని అమ్ముకొని అప్పులు తీర్చుకోవాలని స్థల యజమానురాలు సంఘటన స్థలంలో ఆవేదన వ్యక్తం చేసింది, పుట్టుకతోనే వికలాంగుడైన తన కుమారుడు గోంగూర రాజశేఖర్ nu పోషించుకోవడానికి చేసిన అప్పులు తీర్చుకునేందుకు ఈ స్థలాన్ని అమ్ముకోవడానికి సిద్ధమైనట్లు బాధిత వృద్ధ మహిళ మీడియాకు తెలిపింది.. గ్రామ పెద్దల సమక్షంలో ఆలయంలోని రాతి విగ్రహాలను సమీపంలోని గుడిలో పెట్టుకొని పూజలు నిర్వహించుకునేందుకు గ్రామ పెద్దల వద్ద లక్ష రూపాయలు అప్పులు చేసి ఇచ్చినట్టు బాధితురాల తరఫున పెద్దలు మీడియాకు తెలిపారు. పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వృద్ధ మహిళ డిమాండ్ చేసింది...
Reporter
Namitha News