Tuesday, 15 September 2026 09:48:26 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

మెడికల్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి - సీపీఐ రామానాయుడు

Date : 08 February 2026 08:52 PM Views : 233

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఫిబ్రవరి 08 : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తిరుమల లడ్డూ కల్తీ విషయం చూట్టూనే రాజకీయాలే చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు ఆరోపించారు ఆదివారం బి.కొత్తకోటలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, మురళి తో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని ఘోరంగా ద్రోహం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం, రైతాంగ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యలపై స్పందించకుండా తిరుమల లడ్డూ కల్తీ రాజకీయ డ్రామాలకే పరిమితమవుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్రజలకు జీవనాధారంగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యదావిధిగా కొనసాగించి, కూలీలకు 200 రోజుల పని కల్పించడంతో పాటు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ,తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పనులను కుదించటం ద్వారా గ్రామీణ పేదలను ఆకలిచావుల వైపు నెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని వారు హెచ్చరించారు. అలాగే, రాయలసీమ ప్రాంతం తీవ్ర నీటి కొరతతో అల్లాడుతుంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేయడం అన్యాయం అని పేర్కొన్నారు. ఈ పథకాన్ని తక్షణమే పూర్తి చేసి రాయలసీమ రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. వైద్య రంగంలో నియంత్రణ లేకుండా పెరిగిపోతున్న మెడికల్ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయకుండా ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయడానికి అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులోకి తేవాలని, మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. , కరువుతో కష్టపడుతున్న ప్రాంతాల్లో సాగునీటి సమస్యల పరిష్కారానికి హంద్రీనీవా కాలువకు సబ్ చానల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సబ్ చానల్ ఏర్పాటు చేస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతుల జీవన స్థితి మెరుగుపడుతుందని వారు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి తక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే ప్రజలను సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాలు నిర్వహించేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని వారు హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ కార్మిక, రైతాంగ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న సార్వత్రిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.జిల్లా వ్యాపారం సీపీఐ శ్రేణులు సమ్మెలో పాల్గొనాలని కోరారు.జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.కరోనా సమయంలో బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను తక్షణమే ప్రారంభించాలని కోరారు ఈ సమావేశంలో సీపీఐ తంబళ్లపల్లె నియోజకవర్గ కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ,మురళి,సీనియర్ నాయకులు యస్.బషీర్ ఖాన్,ఏఐటీయూసీ బి.కొత్తకోట మండల అధ్యక్షుడు యస్.తంబయ్యశెట్టి,గంగులప్ప,నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :