నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 30 : తంబళ్లపల్లి మండలంలో బాలి రెడ్డి గారి పల్లి పంచాయతీ లోని పలువురకి పార్లమెంట్ టిడిపి రైతు నాయకుడు వెంకట్ రెడ్డి ,ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా ఆయన సుమారు రెండు లక్షలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు గ్రామాలు తిరిగి లబ్ధిదారులకు పంపిణిచేశాడు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ,తంబళ్లపల్లె నియోజకవర్గం లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఘనత మాకూటమి ప్రభుత్వానికి దక్కినట్లు చెప్పాడు. బాల్ రెడ్డి గారి పల్లి పంచాయతీలో ప్రతి సమస్యను జల్లెడ పట్టి అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి పరిష్కారానికి తన వంతు పూర్తి కృషి చేస్తున్నట్లు భవిష్యత్తులో చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామంలోని తెలుగుదేశం సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News