నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 27 ః మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి లో భాగంగా కూటమి ప్రభుత్వం యగ్ కార్ట్ పథకం ద్వారా చేయూత ఇస్తున్నట్లు ఏపీఎం గంగాధర్ తెలిపారు. సోమవారం ఎగ్ కార్ట్ పథకంలో రూ 50 వేలు సబ్సిడీతో తోపుడు బండి, సరంజామ మంజూరైన నసీబ్ జాన్ కు అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం మండలానికి ఒక ఎగ్ కార్ట్ పథకం కింద 50,000 సబ్సిడీతో చిరు వ్యాపారం తోపుడు బండితో జీవనాధారానికి ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంది అన్నారు. టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వినూత్న పథకాలతో వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామచంద్ర, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొట్టాల శివకుమార్, రామచంద్రారెడ్డి, కాలా నారాయణ, ఐకెపి సంఘమిత్రలు లక్ష్మయ్య, కొటాల భాష, తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News