Sunday, 13 September 2026 03:50:29 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సిఎం చేయడమే - నిసార్ అహ్మద్

Date : 23 December 2025 05:01 PM Views : 192

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మన పథం‌ అభివృద్ధి, మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సిఎం చేయడమే -- నిమ్మనపల్లె వైసిపి నాయకులతో సమావేశమైన నిసార్ అహ్మద్... వివాదంపై ఆరా... నాయకులకు అండగా వుంటామని భరోసా... అనవసర వివాదాలకు దూరంగా వుందాం, కూటమి పెట్టే అక్రమ కేసులకు తావివ్వకుండా వుండాలని నిమ్మనపల్లె వైసిపి నాయకులకు నిసార్ అహ్మద్ సూచించారు. ‌మంగళవారం నిమ్మనపల్లెలో వైసిపి నాయకులతో నిసార్ అహ్మద్ సమావేశమై ఆదివారం రాత్రి జరిగిన ఫ్లెక్సీల వివాదంపై ఆరా తీశారు.‌ జరిగిన ఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు హజరైనారు. నిసార్ అహ్మద్ కు సాదర స్వాగతం పలికారు. నాయకులను పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం నిమ్మనపల్లెలో జరిగిన ఫ్లెక్సీల వివాదంపై నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ జగన్ 2.0 లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తారు. గతంలో జగన్మోహన్ సిఎంగా అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేయాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలని సూచించారు. ‌మళ్లీ జగన్మోహన్ రెడ్డి సిఎం కావాలని అందుకోసం అందరూ కలిసి పని చేద్దామని అన్నారు. ‌చిన్ని, చిన్న వివాదాల కారణంగా కేసులు నమోదు అయ్యేలా చూసుకోవడం, తద్వారా కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు కలిగి విధంగా చేయవద్దని సూచించారు. ఇప్పుడు కూటమి పాలనలో ఇబ్బందులు పడే కార్యకర్త, నాయకుల వివరాలు డిజిటల్ బుక్ లో నమోదు చేయడం జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటానే వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ‌మన పథం అభివృద్ధి అని, మన లక్ష్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సిఎం చేయడమే అన్నారు.‌ అభివృద్ధి, సంక్షేమానికి మళ్ళీ వైసిపి ప్రభుత్వామే రావాలని ప్రజలు కోరుతున్నారని, ఇందుకు అనుగుణంగా మనం ప్రజలకు చేరువ కావాలని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, రమణా రెడ్డి, రెడ్డిశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, హేమంత్, జయప్రకాష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రఫీ , షరాఫత్, నూర్ మొహిద్దీన్, నాగరాజ్, వెంగంవారిపల్లి శ్రీనివాసులు రెడ్డి, వెంగంవారిపల్లె, దావూద్, శ్రీనివాసులు రెడ్డి, హోటల్ రఫీ, నరేష్, యోగానంద రెడ్డి పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :