Thursday, 30 July 2026 11:54:50 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సిఎం చేయడమే - నిసార్ అహ్మద్

Date : 23 December 2025 05:01 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మన పథం‌ అభివృద్ధి, మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సిఎం చేయడమే -- నిమ్మనపల్లె వైసిపి నాయకులతో సమావేశమైన నిసార్ అహ్మద్... వివాదంపై ఆరా... నాయకులకు అండగా వుంటామని భరోసా... అనవసర వివాదాలకు దూరంగా వుందాం, కూటమి పెట్టే అక్రమ కేసులకు తావివ్వకుండా వుండాలని నిమ్మనపల్లె వైసిపి నాయకులకు నిసార్ అహ్మద్ సూచించారు. ‌మంగళవారం నిమ్మనపల్లెలో వైసిపి నాయకులతో నిసార్ అహ్మద్ సమావేశమై ఆదివారం రాత్రి జరిగిన ఫ్లెక్సీల వివాదంపై ఆరా తీశారు.‌ జరిగిన ఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు హజరైనారు. నిసార్ అహ్మద్ కు సాదర స్వాగతం పలికారు. నాయకులను పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం నిమ్మనపల్లెలో జరిగిన ఫ్లెక్సీల వివాదంపై నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ జగన్ 2.0 లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తారు. గతంలో జగన్మోహన్ సిఎంగా అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేయాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలని సూచించారు. ‌మళ్లీ జగన్మోహన్ రెడ్డి సిఎం కావాలని అందుకోసం అందరూ కలిసి పని చేద్దామని అన్నారు. ‌చిన్ని, చిన్న వివాదాల కారణంగా కేసులు నమోదు అయ్యేలా చూసుకోవడం, తద్వారా కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు కలిగి విధంగా చేయవద్దని సూచించారు. ఇప్పుడు కూటమి పాలనలో ఇబ్బందులు పడే కార్యకర్త, నాయకుల వివరాలు డిజిటల్ బుక్ లో నమోదు చేయడం జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటానే వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ‌మన పథం అభివృద్ధి అని, మన లక్ష్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సిఎం చేయడమే అన్నారు.‌ అభివృద్ధి, సంక్షేమానికి మళ్ళీ వైసిపి ప్రభుత్వామే రావాలని ప్రజలు కోరుతున్నారని, ఇందుకు అనుగుణంగా మనం ప్రజలకు చేరువ కావాలని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, రమణా రెడ్డి, రెడ్డిశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, హేమంత్, జయప్రకాష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రఫీ , షరాఫత్, నూర్ మొహిద్దీన్, నాగరాజ్, వెంగంవారిపల్లి శ్రీనివాసులు రెడ్డి, వెంగంవారిపల్లె, దావూద్, శ్రీనివాసులు రెడ్డి, హోటల్ రఫీ, నరేష్, యోగానంద రెడ్డి పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :