నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట - నవంబర్ 15 : అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనికీ నిత్యం రోగులకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. శనివారం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించి వైద్యులతో చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడారు. ఆసుపత్రిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వైద్యులకు చమర్తి సూచించారు.సిబ్బంది వివరాలు, వైద్యుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఓపికి ఎంతమంది వస్తున్నారని అని ఆరా తీశారు. అదేవిధంగా వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదని చమర్తి హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని, డయాలసిస్ సెంటర్, ఆసుపత్రిలో వసతులు బాగా ఉండాలని పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News