Monday, 14 September 2026 09:34:29 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడుకోండి - అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

నో హెల్మెట్ - నో ఫ్యూయల్' నిబంధన అమలుకు సన్నాహాలు

Date : 06 January 2026 06:02 PM Views : 252

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 06 : రోడ్డు భద్రత అనేది కేవలం ఒక నిబంధన కాదు, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా (జనవరి 01 నుండి 31 వరకు), మంగళవారం రాయచోటి పట్టణంలో హెల్మెట్ ధారణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా ఎస్పీ గారు స్వయంగా హెల్మెట్ ధరించి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ కడప రింగ్ రోడ్ వద్ద ప్రారంభమై, శివాలయం చెక్ పోస్ట్ మీదుగా బంగ్లా వరకు ఉత్సాహంగా సాగింది. పోలీసు అధికారులు, సిబ్బంది, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, విద్యా సంస్థల ప్రతినిధులు మరియు పట్టణ బైక్ మెకానిక్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతా నినాదాలతో ప్రజల్లో చైతన్యం నింపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ద్విచక్ర వాహన ప్రమాదాల్లో జరిగే మరణాలలో అధిక శాతం తలకు గాయాలు కావడం వల్లే జరుగుతున్నాయి. ఐఎస్ఐ (ISI) ముద్ర కలిగిన హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుండి 80% పైగా తప్పించుకోవచ్చు. అతివేగం ఆపదకు మూలమని, యువత అత్యుత్సాహంతో బైక్ రేసింగ్‌లు చేసి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని కోరారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు గాను, హెల్మెట్ ధరించని వాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు, రాయచోటి డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్ గారు, ట్రాఫిక్ సి.ఐ. కులాయప్ప, రాయచోటి పట్టణ మరియు రూరల్ సి.ఐలు చలపతి, రోషన్, లక్కిరెడ్డిపల్లి సి.ఐ. కృష్ణంరాజు నాయక్, ఎం.వి.ఐ. సుబ్బరాయుడు, పలువురు ఎస్.ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: