నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఫిబ్రవరి 03 : డెహ్రాడూన్ లో జరిగిన యుద్ధకళ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొని విజయం సాధించి జాతీయ స్థాయిలో బంగారు పతకం పొందిన ఆత్మకూరుకు చెందిన ఏడవ తరగతి చదివే సయ్యద్ మొహిద్దిన్ ఖాదరి నేడు ఆత్మకూరుకు విచ్చేసిన సందర్భంగా వారి సన్నిహితులు, మిత్రులు, బంధువులు, పాఠశాల ఉపాధ్యాయులు బాలుడిని ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి భారీ కేక్ ను కట్ చేశారు.. తమ కుమారుడు బంగారు పతకం సాధించేందుకు సహకరించిన అందరికీ ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి సహకరించిన కోచ్ సాయికిరణ్ కు మీడియా మిత్రులందరికి బాలుని తండ్రి సయ్యద్. జలీల్ ధన్యవాదాలు తెలిపారు.. తన కోచ్ సాయికిరణ్ ను తాను స్ఫూర్తిగా తీసుకొని ఈ పోటీలలో పాల్గొన్నానని ఆంధ్ర ప్రదేశ్ లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించి నేడు ఆత్మకూరుకు వచ్చిన తనను ఇంత ఘనంగా సత్కరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా నా విజయానికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చిన మా కోచ్ సాయికిరణ్ గారికి నాలోని ఆసక్తిని ప్రోత్సహించి నన్ను డెహ్రాడూన్ కు తీసుకెళ్లి పోటీలో పాల్గొనేలా సహకరించిన నా తల్లిదండ్రులు నా కుటుంబ సభ్యులు బంధువులందరికీ బంగారు పతకం విజేత సయ్యద్ మొహిద్దిన్ ఖాదరి ధన్యవాదాలు తెలిపారు.. ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు ఈ విద్యార్థిని ఘనంగా సత్కరించారు
Admin
Namitha News