Friday, 19 June 2026 03:23:14 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలి -- మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

Date : 21 April 2026 06:19 PM Views : 78

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలి -- మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద ఎపి మున్సిపల్ వర్కర్స్ అంస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ వర్కర్స్ కి వెంటనే జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు హరిశర్మ, పట్టణ కన్వీనర్ రామకృష్ణ లు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చాలీచాలని జీతాలతో ఉదయం 5 గంటలకే విధుల్లోకి వచ్చి వీధులను, కాలువలను, రోడ్లను శుభ్రం చేస్తూ, చెత్త చెదారాన్ని ఎత్తేస్తూ పారిశుద్ధ్య మెరుగుకు ఎంతో పని చేస్తున్నామన్నారు‌ తమకు చాలీచాలని జీతాలతోనే జీవితాలను నెట్టికొస్తున్నామని, కుటుంబాలు గడవడం కష్టతరంగా మారిందన్నారు. ఇస్తున్న తక్కువ జీతం కూడా నెలలు తరబడి బకాయిలు పెట్టడంతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టతరంగా మారిందన్నారు. మార్చి నెల జీతం ఏప్రిల్ 21వ తేదీ అవుతున్నా ఇవ్వకపోవడంతో తాము ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్ అయిన, మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. 20 నుంచి 25 ఏళ్ల పాటు పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న వారికి వెంటనే ఇళ్ల స్థలాలను మంజూరు చేసి నిర్మాణాలకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని కోరారు. తమకు కడుపు మండినందునే ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తూ ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. తమను ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ సకాలంలో జీతాలు చెల్లించకపోతే ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కావున మున్సిపల్ అధికారులు స్పందించి తమ జీతాలను వెంటనే విడుదల చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. అనంతరం కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసులు సిఐటియు నాయకులు ప్రభాకర్ రెడ్డి, గోపాల్, రామచంద్ర, కృష్ణప్ప, రాజు, మంజుల, శివమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :