Monday, 14 September 2026 09:07:51 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రభుత్వాసుపత్రి మహిళా జూనియర్ అసిస్టెంట్ పై మరో జూనియర్ అసిస్టెంట్ విచక్షణ రహిత దాడి

విషయం బయటికి పొక్కకుండా ఆసుపత్రి వర్గాల మంతనాలతో ఆలస్యం గా వెలుగులోకి

Date : 07 May 2026 08:07 PM Views : 308

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 07 : మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళా జూనియర్ అసిస్టెంట్ పై మరో జూనియర్ అసిస్టెంట్ స్కానింగ్ రూమ్ లోనే విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే వ్యక్తి మరో మహిళా జూనియర్ అసిస్టెంట్ పై బుధవారం ఉదయం స్కానింగ్ రూములోనే భౌతిక దాడికి తెగపడ్డాడు. రోగులు, అటెండర్లు ఇతర ఆస్పత్రి సిబ్బంది గమనించి జూనియర్ అసిస్టెంట్ ని కాపాడి అదే ఆసుపత్రిలో చికిత్స అందించారు. సాధారణంగా జూనియర్ అసిస్టెంట్ గా పని చేసే వారికి రోస్టర్ విధానంలో డ్యూటీలు మారుస్తారు. అయితే అతనికి మాత్రం ఒకే చోట డ్యూటీలు వేస్తుండటంపై ఇతర జూనియర్ అసిస్టెంట్లు అభ్యంతరం తెలిపారు. అయితే ఆ జూనియర్ అసిస్టెంట్లకు గాయపడిన జూనియర్ అసిస్టెంట్ సమాచారం అందిస్తుందన్న సాకుతో సూపరింటెండెంట్ ఛాంబర్ లోని సీసీ కెమెరా పుటేజిని పరిశీలించి ఆమె స్కానింగ్ రూమ్ లోకి వెళ్ళడం గమనించి నేరుగా స్కానింగ్ రూమ్ కే వచ్చి విచక్షణ రహితంగా కొట్టడం జరిగిందని తెలిసింది. గతంలో కూడా పలుమార్లు సాయి సదరు మహిళపై భౌతిక దాడి చేయడం జరిగిందని బాదితులు తెలిపారు. కేసు పెట్టచ్చు కద అని ప్రశ్నించగా ఎవరూ అండగా లేరని తదనంతరం తిరిగి ఏదైనా చేస్తాడనే భయంతో మిన్నకుండిపోయాం అన్నారు. అతను తన పలుకుబడితో మిగిలిన జూనియర్ అసిస్టెంట్ల రోస్టర్లు కూడా మార్చేస్తున్నాడని సమాచారం అందింది. అయితే బాధితురాలిని భయపెట్టి ఈ వ్యవహారం బయటికి పొక్కకుండా ఆస్పత్రిలో కొందరు గట్టి ప్రయత్నాలు చెయ్యడంతో బుదవారం జరిగిన దాడి విషయం ఆలస్యంగా బయటపడింది. ఈ విషయం పై ఆర్ఎంవో డాక్టర్ రాధిక ను వివరణ కోరగా తన దృష్టికి దాడికి సంబందించిన ఎలాంటి ఫిర్యాదు రాలేదని , బాధితురాలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: