నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 07 : తమ సమస్యల పరిష్కారంలో భాగంగా మండలంలోని కాంట్రాక్ట్ విద్యుత్ వర్కర్లు ఈనెల 9వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ వర్కర్ల నాయకుడు భాస్కర్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో విలీనం చేసి రేగులురైజేషన్ చేయాలని, దళారి వ్యవస్థ రద్దుచేసి, సమాన పనికి సమాన వేతనం చెల్లింపు, పాత కొత్త తేడా లేకుండా వర్కర్లందరికి సమాన వేతనం, రిటైర్మెంట్ గ్రాటివిటీ 10 లక్షలు అమలుతో పాటు అన్లిమిటెడ్ వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
Reporter
Namitha News