Monday, 08 June 2026 08:29:28 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

కార్తీక నోము నోచుకున్న దాసిరిపల్లి కల్పనా రెడ్డి

Date : 10 November 2025 08:44 PM Views : 276

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 10 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండలో సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మహా శివుని సన్నిధిలో టిడిపి మాజీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి సతీమణి దాసరిపల్లి కల్పనా రెడ్డి కార్తీక పౌర్ణమి నోము నోచుకున్నారు. సోమవారం ఆమె మల్లయ్య కొండకు నియోజకవర్గంలోని టిడిపి నాయకుల భారీ వాహన శ్రేణితో కలిసి మల్లయ్య కొండ చేరుకుని మహా శివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం నిర్వహించి మహిళలతో సాదాసీదాగా గౌరీ మాత కార్తీక్ నోము నోచుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ప్రజలు మల్లయ్య కొండ మహాశివుని కరుణాకటాక్షాలతో పాడి పంటలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొండపై అన్నదాన కార్యక్రమం లో పాల్గొని అనంతరం గౌరీ ఆలయం, భగీరథ, వీరన్న గెవి, వెలుగు మల్లమ్మ ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొలకలచెరువు ఆమె స్వగృహంలో తంబళ్లపల్లె నియోజకవర్గం ఆరు మండలాలకు చెందిన మండల స్థాయి టిడిపి నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు.ఆమె వెంట తులసీదర్ నాయుడు,డేరంగుల చంద్ర, ఆనంద నాయుడు, మదన్ మోహన్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున, భాస్కర్, నియోజవర్గంలోని టిడిపి నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :