నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 10 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండలో సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మహా శివుని సన్నిధిలో టిడిపి మాజీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి సతీమణి దాసరిపల్లి కల్పనా రెడ్డి కార్తీక పౌర్ణమి నోము నోచుకున్నారు. సోమవారం ఆమె మల్లయ్య కొండకు నియోజకవర్గంలోని టిడిపి నాయకుల భారీ వాహన శ్రేణితో కలిసి మల్లయ్య కొండ చేరుకుని మహా శివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం నిర్వహించి మహిళలతో సాదాసీదాగా గౌరీ మాత కార్తీక్ నోము నోచుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ప్రజలు మల్లయ్య కొండ మహాశివుని కరుణాకటాక్షాలతో పాడి పంటలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొండపై అన్నదాన కార్యక్రమం లో పాల్గొని అనంతరం గౌరీ ఆలయం, భగీరథ, వీరన్న గెవి, వెలుగు మల్లమ్మ ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొలకలచెరువు ఆమె స్వగృహంలో తంబళ్లపల్లె నియోజకవర్గం ఆరు మండలాలకు చెందిన మండల స్థాయి టిడిపి నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు.ఆమె వెంట తులసీదర్ నాయుడు,డేరంగుల చంద్ర, ఆనంద నాయుడు, మదన్ మోహన్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున, భాస్కర్, నియోజవర్గంలోని టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News