నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : రామసముద్రం మండలం గొల్లపల్లి మోడల్ ప్రైమరీ పాఠశాల లోని 55 మంది విద్యార్థులకు సోమవారం ఆ పాఠశాల ఉపాధ్యాయులు, మండల ఎస్టియు అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మరియు పాఠశాల కమిటీ సభ్యుడు పురుషోత్తం సంయుక్తంగా స్వంత నిధులతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు, టైలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి హేమలత మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాతలకు మరియు ఉపాధ్యాయులను అభినందించారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు, కమిటీ సభ్యుల సహకారం ఎంతైనా అవసరమని, ఈ పాఠశాలలోని పిల్లల అభివృద్ధి బాగుందని ఉపాధ్యాయులను కొనియాడారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి హేమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్టియు అధ్యక్షుడు అయూబ్ ఖాన్ గొల్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షాహిరా ,చోకాండ్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, గొల్లపల్లి ఉపాధ్యాయురాలు రెడ్డినీలాంబ, పాఠశాల కమిటీ చైర్మన్ నాగభూషణం, సభ్యులు అమరప్ప, సుజ్ఞానమూర్తి, చస్మా, ఉపాధ్యాయులు చిన్న రెడ్డప్ప , రామన్న తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News