Thursday, 16 April 2026 03:18:55 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

తంబళ్లపల్లె మండల అభివృద్ధికి సమిష్టి కృషి చేద్దాం - ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి

తంబళ్లపల్లె మండలం మీట్ లో ఎంపీపీ శ్యామల

Date : 12 March 2026 08:26 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 12 : తంబళ్లపల్లె మండలాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారుల పరస్పర సమన్వయంతో సమిష్టి కృషి చేద్దామని ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి కోరారు. గురువారం ఎంపీపీ మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ సురేంద్ర మాట్లాడుతూ మండలంలోని సబ్స్టేషన్ల పరిధిలో లోవోల్టేజ్ సమస్యలను అధిగమించామని, భవిష్యత్తులో విద్యుత్ సమస్య లకు ప్రత్యామ్నాయంగా సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు పై సభ్యులకు వివరించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్ మాట్లాడుతూ మండలంలో తాగునీటి సమస్యలపై దృష్టి సారించామని అదేవిధంగా డ్రైనేజీలు,మరుగుదొడ్లు, నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పి ఆర్ ఏఈ,రమణ మాట్లాడుతూ తంబళ్లపల్లె లో కోటి రూపాయలతో సిసి రోడ్లు, మురికినీటి కాలువలు నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని రెండవ దశలో మండల పరిధిలో పనులు చేపడతామన్నారు. తాసిల్దార్ శ్రీనివాసులు మండలంలో గతంలో చేపట్టిన భూముల రీసర్వేలో చేసిన పొరపాట్లు సరిదిద్ది పక్కాగా పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేయడంతో పాటు జాయింట్ ఎల్ పి ఎం తోపాటు పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. సిడిపిఓ సుజాత అంగన్వాడి సెంటర్లకు అందజేస్తున్న గర్భిణీలు,బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం తదితర అంశాలపై సభకు వివరించారు. ఏపీవో అంజనప్ప వి బి జి రాంజీ ఉపాధి హామీ నూతన చట్టంలోని ఉపయోగాలను తెలియజేశారు. ఆర్టీసీ ప్రతినిధి బాబ్జి ఆర్టీసీ అందిస్తున్న సేవలను5 వివరించి సభ్యులు అడిగిన సమస్యలకు పరిష్కార హామీ ఇచ్చారు. ఐకెపి ద్వారా సంఘాలకు అందిస్తున్న రుణాలు, సద్వినియోగం పై సీసీ రమణ వివరణ ఇచ్చారు. మండలంలోని పాఠశాలల్లో విద్యా విధానం, నిర్వహణ తదితర అంశాలపై సీఆర్పీ సుధాకర్ విశదీకరించారు. కాగా మండలంలోని ఇరిగేషన్,హార్టికల్చర్, సిరికల్చర్, ఆర్ అండ్ బి, సహకార శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు గైర్హాజర్ కావడం విశేషం. ఈ మండల మీట్లో ఏవో థామస్ రాజా, కో ఆప్షన్ మెంబర్ జమాల్ బాషా, ప్రత్యేక ఆహ్వానితుడు ఎరుకలరెడ్డి, కూటమి కమిటీ సభ్యులు రెడ్డప్ప రెడ్డి,భేరి శ్రీనివాసులు,తులసీ ధర్నాయుడు, రామచంద్ర, పురుషోత్తం, ఎద్దుల నరసింహులు,ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. ములకలచెరువు సీఐ వెంకటేశ్వర్లు ఎస్సైలు ప్రతాప్, శ్రావణి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :