నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 12 : తంబళ్లపల్లె మండలాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారుల పరస్పర సమన్వయంతో సమిష్టి కృషి చేద్దామని ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి కోరారు. గురువారం ఎంపీపీ మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ సురేంద్ర మాట్లాడుతూ మండలంలోని సబ్స్టేషన్ల పరిధిలో లోవోల్టేజ్ సమస్యలను అధిగమించామని, భవిష్యత్తులో విద్యుత్ సమస్య లకు ప్రత్యామ్నాయంగా సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు పై సభ్యులకు వివరించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్ మాట్లాడుతూ మండలంలో తాగునీటి సమస్యలపై దృష్టి సారించామని అదేవిధంగా డ్రైనేజీలు,మరుగుదొడ్లు, నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పి ఆర్ ఏఈ,రమణ మాట్లాడుతూ తంబళ్లపల్లె లో కోటి రూపాయలతో సిసి రోడ్లు, మురికినీటి కాలువలు నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని రెండవ దశలో మండల పరిధిలో పనులు చేపడతామన్నారు. తాసిల్దార్ శ్రీనివాసులు మండలంలో గతంలో చేపట్టిన భూముల రీసర్వేలో చేసిన పొరపాట్లు సరిదిద్ది పక్కాగా పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేయడంతో పాటు జాయింట్ ఎల్ పి ఎం తోపాటు పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. సిడిపిఓ సుజాత అంగన్వాడి సెంటర్లకు అందజేస్తున్న గర్భిణీలు,బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం తదితర అంశాలపై సభకు వివరించారు. ఏపీవో అంజనప్ప వి బి జి రాంజీ ఉపాధి హామీ నూతన చట్టంలోని ఉపయోగాలను తెలియజేశారు. ఆర్టీసీ ప్రతినిధి బాబ్జి ఆర్టీసీ అందిస్తున్న సేవలను5 వివరించి సభ్యులు అడిగిన సమస్యలకు పరిష్కార హామీ ఇచ్చారు. ఐకెపి ద్వారా సంఘాలకు అందిస్తున్న రుణాలు, సద్వినియోగం పై సీసీ రమణ వివరణ ఇచ్చారు. మండలంలోని పాఠశాలల్లో విద్యా విధానం, నిర్వహణ తదితర అంశాలపై సీఆర్పీ సుధాకర్ విశదీకరించారు. కాగా మండలంలోని ఇరిగేషన్,హార్టికల్చర్, సిరికల్చర్, ఆర్ అండ్ బి, సహకార శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు గైర్హాజర్ కావడం విశేషం. ఈ మండల మీట్లో ఏవో థామస్ రాజా, కో ఆప్షన్ మెంబర్ జమాల్ బాషా, ప్రత్యేక ఆహ్వానితుడు ఎరుకలరెడ్డి, కూటమి కమిటీ సభ్యులు రెడ్డప్ప రెడ్డి,భేరి శ్రీనివాసులు,తులసీ ధర్నాయుడు, రామచంద్ర, పురుషోత్తం, ఎద్దుల నరసింహులు,ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. ములకలచెరువు సీఐ వెంకటేశ్వర్లు ఎస్సైలు ప్రతాప్, శ్రావణి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు
Reporter
Namitha News