నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం- డిసెంబర్ 03 : రామసముద్రం మండలం చొక్కాండ్ల పల్లె, మినికి గ్రామపంచాయతీలలో బుధవారం ఎంపీడీవో లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపీడీవో గపూర్ సందర్శించారు. ఈ సందర్బంగా హౌస్ టాక్స్ కలెక్షన్,ఆధార్ అండ్ మొబైల్ నెంబర్, స్వామిత్వసర్వే పనులను సానుకూలంగా పూర్తిచేయాలన్నారు ప్రజలు ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు సేకరించి స్వర్ణ పంచాయతీ లో అప్ డేట్ చేయాలని, గ్రామాల్లో ఇంటి పన్నుల సేకరణ వేగవంతం చేయాలని గార్బెజ్ కలెక్షన్ ఐ వి ఆర్ ఎస్ కాల్స్ మెరుగు పరచాలని కాల్స్ పిర్యాదులకు సమయానికి స్పందించాలని పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయం సిబ్బంది ఆదేశించారు .మినికి గ్రామపంచాయతీలోని చెత్త నుండి సంపద తయారి కేంద్రాన్ని పరిశీలించి కార్మికులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపిడిఓ గఫూర్ పంచాయతీ కార్యదర్శులు భానుముర్తి బిఆర్ ప్రకాష్, సచివాలయం సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.
Reporter
Namitha News