నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 05 : ప్రజల సమస్యల పట్ల పోలీసులు ఎల్లప్పుడూ జవాబుదారీతనంతో మెలిగి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. సోమవారం మదనపల్లి డిఎస్పీ గారి కార్యాలయం లో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)” కార్యక్రమంలో ఎస్పీ గారు స్వయంగా పాల్గొని, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో ముఖాముఖి గా మాట్లాడుతూ వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను విచారించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు మరియు వేధింపులపై వచ్చిన అర్జీలను ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. అర్జీదారులకు న్యాయం జరిగినట్లు నిర్ధారించుకోవడమే కాకుండా, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులకు సూచించారు. అక్రమ వడ్డీ వ్యాపారాలు, ఆన్లైన్ మోసాలు మరియు మహిళలపై జరుగుతున్న వేధింపుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు.
Admin
Namitha News