నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 13 : పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు డాక్టర్ అయూబ్ ఖాన్... సోమవారం శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపైన గల బస్ స్టాప్ సమీపంలో ఆయన ఉదయం నుంచి బయటాయించి నిరసనను కొనసాగించారు. రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోవడంతో శనీశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ రోడ్డు దుస్థితి కారణంగా రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయని,స్థానిక ప్రజలు, పాఠశాల విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఆర్.ఎం.బి శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు పూర్తయ్యే వరకు తన శాంతియుత నిరాహార దీక్షను కొనసాగిస్తానని అయూబ్ ఖాన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు, పట్టణ ప్రముఖులు త్రిమూర్తులు రెడ్డి, నాగరాజా,రాజా,తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News