Wednesday, 29 July 2026 08:17:16 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రోడ్డు మరమ్మత్తు కోసం బిజెపి నేత నిరాహార దీక్ష

Date : 13 July 2026 10:02 PM Views : 87

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 13 : పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు డాక్టర్ అయూబ్ ఖాన్... సోమవారం శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపైన గల బస్ స్టాప్ సమీపంలో ఆయన ఉదయం నుంచి బయటాయించి నిరసనను కొనసాగించారు. రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోవడంతో శనీశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ రోడ్డు దుస్థితి కారణంగా రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయని,స్థానిక ప్రజలు, పాఠశాల విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఆర్.ఎం.బి శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు పూర్తయ్యే వరకు తన శాంతియుత నిరాహార దీక్షను కొనసాగిస్తానని అయూబ్ ఖాన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు, పట్టణ ప్రముఖులు త్రిమూర్తులు రెడ్డి, నాగరాజా,రాజా,తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :