నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 18 : తంబళ్లపల్లె మండలం లోని 21 పంచాయతీల కార్యదర్శిలకు (ఆర్.జి.ఎస్.ఏ) రాష్ట్రీయ గ్రామ స్వరాజ్యం అభియాన్ అభివృద్ధి ప్రణాళికపై ఎంపీడీవో ఉషారాణి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి పన్నుల వసూళ్లు, ఆదాయ వనరులు గుర్తించి పంచాయతీల లోని గ్రామాలలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. కార్యదర్శులు గ్రామాలలో క్షేత్రస్థాయి పర్యటనతో సమస్యలను గుర్తించి పరిష్కారంతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతీకుమార్, ఏవో థామస్ రాజా కార్యదర్శులు పాల్గొన్నారు
Reporter
Namitha News