Sunday, 13 September 2026 09:59:31 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సీపీఐ నాయకుల డిమాండ్

Date : 15 June 2026 10:18 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 15 : మదనపల్లి పట్టణం కు జూన్ 20న జలధార భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లికి వస్తున్న సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, మురళి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి ప్రాంతంలో త్రాగునీరు, సాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే హంద్రీనీవా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించి చెరువులను నింపే కార్యాచరణను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలతో మదనపల్లి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మదనపల్లి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని, మదనపల్లి-రామసముద్రం రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించాలని కోరారు. వ్యవసాయాధారిత ప్రాంతమైన మదనపల్లిలో టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే నూతన ప్రభుత్వ పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఆరోగ్యం, విద్య, రోడ్లు, తాగునీరు, ఉపాధి వంటి ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన కేవలం భూమి పూజ భహిరంగ సభకే పరిమితం కాకుండా, మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి స్పష్టమైన హామీలు, నిధుల కేటాయింపులు ప్రకటించాలి. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించి అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: