Thursday, 30 July 2026 03:35:07 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గ్రామీణ ప్రాంత నీటి నాణ్యత పరీక్షలపై శ్రద్ధ చూపండి - ఎఈఈ వినోద్ కుమార్

Date : 24 March 2026 08:25 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 24 : తంబళ్లపల్లె మండలంలోని ప్రతి గ్రామీణ ప్రాంత తాగునీటి వనరుల నాణ్యత పరీక్షలపై పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ ఆధ్వర్యంలో గ్రామాలలో నీటి నాణ్యత పరీక్షలపై కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం జరిగింది.ఎఈఈ మాట్లాడుతూ పంచాయతీలకు నీటి నాణ్యత పరీక్షల కోసం పి టి కె కిట్ అందిస్తామని దాని ద్వారా ప్రతిరోజు తాగునీటి ట్యాంకు లోని నీటిని, 15 రోజులకు ఒక మారు ప్రతి ఇంటి లోని నీటిని, నెలకు ఒక మారు పాఠశాలలు, అంగన్వాడీలు, కార్యాలయాలలోని నీటిని పరీక్షించాలన్నారు. ఈ పరీక్షల నివేదికలను ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు. తాగునీటి వనరులు నాణ్యత పరీక్షల నిర్లక్ష్యం వహించరాదని తాగునీటి కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవోలు ప్రసాద్, మారుతీ కుమార్, కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :