Friday, 19 June 2026 05:01:50 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

మైసూరులో చైతన్య సేవా సంస్థ వ్యవస్థాపకుడికి ఘన సత్కారం

Date : 22 April 2026 08:47 PM Views : 124

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మైసూరులో చైతన్య సేవా సంస్థ వ్యవస్థాపకుడికి ఘన సత్కారం మత సామరస్యానికి సేవలకుగాను ఎంపీ ఆనందన్‌కు యు ఆర్ ఐ అవార్డు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఇంటర్నేషనల్ యూత్ హాస్టల్‌లో నిర్వహించిన యునైటెడ్ రిలిజియన్స్ ఇనిషియేటివ్ (యు ఆర్ ఐ) దక్షిణ భారత రాష్ట్రాల కోఆపరేటివ్ సర్కిల్స్ విస్తృత సమావేశంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్‌కు ప్రత్యేక అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. మతాంతర సౌహార్దం, శాంతి, న్యాయం మరియు సామాజిక సమగ్రత కోసం ఆయన చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి (యు ఆర్ ఐ ) దక్షిణ భారత నాయకత్వం ఈ గౌరవాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా పలువురు సామాజికవేత్తలు, సంఘసంస్కర్తలు ఎంపీ ఆనందన్ సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రపంచ శాంతి స్థాపనలో యు ఆర్ ఐ 109 దేశాల్లో పనిచేస్తోందని, కుల మతాలకు అతీతంగా ప్రతి మనిషిని సమానంగా గౌరవించడం అవసరమని తెలిపారు. ప్రతి మతం మానవత్వాన్ని బోధిస్తుందని, మానవసేవే మాధవసేవ అని పేర్కొంటూ సమాజంలో మానవీయ విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వచ్చిన కోఆపరేటివ్ సర్కిల్స్ ప్రతినిధులు పాల్గొని మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సత్కారం అందుకున్న వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ ఈ గౌరవం తనకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో మత సామరస్యానికి కృషి చేస్తున్న అందరికీ దక్కినదేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా శాంతి, న్యాయం, మానవ విలువల పరిరక్షణ కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ కోఆర్డినేటర్ వి.ఎస్. రెడ్డి, ఆసియా కోఆర్డినేటర్ డాక్టర్ అబ్రహం కారికమ్, కర్ణాటక స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ వర్షా, మత్తయి కుట్టి తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :