Thursday, 30 July 2026 12:22:09 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఎయిడ్స్ రహిత జిల్లాగా అన్నమయ్యను తీర్చిదిద్దుదాం

మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Date : 07 May 2026 02:34 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 07 : అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పిలుపునిచ్చారు. గురువారం మదనపల్లిలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమానికి సంబంధించిన అవగాహన కరపత్రాలను సంయుక్త కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..., జిల్లాలో ఎయిడ్స్ నివారణ, నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సంబంధిత వైద్య సేవా కేంద్రాలు, సమీకృత సలహా మరియు పరీక్షా కేంద్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడంతో పాటు, హెచ్ఐవి నిర్ధారణ అయిన వారికి క్రమం తప్పకుండా చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన పరీక్షా సామగ్రి, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎయిడ్స్ నిర్మూలన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని, సమిష్టి కృషితో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ మరియు కుష్టు నివారణ అధికారి డాక్టర్ రాధిక, కార్యక్రమ సమన్వయ అధికారి వి. భాస్కర్, జిల్లా సహకారశాఖ అధికారి త్యాగరాజు, వ్యవసాయ శాఖ జేడి తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :