Monday, 14 September 2026 09:51:34 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఎయిడ్స్ రహిత జిల్లాగా అన్నమయ్యను తీర్చిదిద్దుదాం

మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Date : 07 May 2026 02:34 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 07 : అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పిలుపునిచ్చారు. గురువారం మదనపల్లిలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమానికి సంబంధించిన అవగాహన కరపత్రాలను సంయుక్త కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..., జిల్లాలో ఎయిడ్స్ నివారణ, నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సంబంధిత వైద్య సేవా కేంద్రాలు, సమీకృత సలహా మరియు పరీక్షా కేంద్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడంతో పాటు, హెచ్ఐవి నిర్ధారణ అయిన వారికి క్రమం తప్పకుండా చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన పరీక్షా సామగ్రి, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎయిడ్స్ నిర్మూలన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని, సమిష్టి కృషితో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ మరియు కుష్టు నివారణ అధికారి డాక్టర్ రాధిక, కార్యక్రమ సమన్వయ అధికారి వి. భాస్కర్, జిల్లా సహకారశాఖ అధికారి త్యాగరాజు, వ్యవసాయ శాఖ జేడి తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :