నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 13 : మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ మదనపల్లి - సెప్టెంబర్ 13 : తాజ్ హోటల్ పటాన్ ఖాదర్ ఖాన్ పౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలతో పాటు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, మదనపల్లె ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని వారు సూచించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తులసి, నాగూర్ వలి, పార్లమెంట్ జనరల్ సెక్రటరీ అయూబ్, బాబ్జాన్, వెంకటేష్, మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు
Reporter
Namitha News