Monday, 14 September 2026 07:36:48 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

అంతరిక్షం లోకి రాకెట్ ల్యాంచ్ పై మిట్స్ విద్యార్థులకు అవగాహన

ముఖ్య అతిధిగా భారతదేశ ఇస్రో మాజీ శాస్త్రవేత్త, కిస్సెట్ (QISCET) డైరెక్టర్, భారత అంతరిక్ష విభాగానికి చెందిన ఇన్ స్పేస్ టెక్నికల్ అడ్వైజర్ బి. వి. సు

Date : 22 January 2026 07:16 PM Views : 209

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 22 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు అంతరిక్ష కేంద్రంలోని రాకెట్ లాంచ్ బేస్ స్టేషన్‌ల కోసం రేంజ్ సిస్టమ్స్ అనే అంశంపై ఒక్క రోజు అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారతదేశ ఇస్రో మాజీ శాస్త్రవేత్త, కిస్సెట్ (QISCET) డైరెక్టర్, భారత అంతరిక్ష విభాగానికి చెందిన ఇన్ స్పేస్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ బి. వి. సుబ్బారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాకెట్ ప్రయోగ సమయంలో దాని దూరం, దిశ, కదలికలను గుర్తించే రేంజ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో విద్యార్థులకు వివరించారు. రాకెట్ ప్రయాణాన్ని నిరంతరం గమనించి అవసరమైన సమాచారాన్ని లాంచ్ బేస్ స్టేషన్‌కు పంపించి, రాకెట్ నిర్ణయించిన మార్గంలోనే వెళ్తుందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఈ వ్యవస్థలు ఉపయాగపడతాయని తెలిపారు. ఏదైనా లోపం వచ్చినప్పుడు వెంటనే గుర్తించి ప్రమాదాలను నివారించడంలో ఇవి సహాయపడతాయి అని అన్నారు. అంతేకాకుండా రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యేందుకు, ఉపగ్రహాన్ని సరైన కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రేంజ్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషితాయని తెలిపారు. అలాగే ఉపగ్రహాల రూపకల్పన, అభివృద్ధిలో భాగమైన వివిధ సబ్-సిస్టమ్స్ గురించి అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఇస్రో సంస్థ గౌరవం తీసుకొచ్చింది అని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇస్రో, నాసా వంటి అంతర్జాతీయ పరిశోధనా సంస్థలలో ఆధునిక టెక్నాలిజీలపై అవగాహన పెంచుకొని, ఈ సంస్థలు అందిస్తున్న ఇంటర్న్ షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని తెలిపారు. కంప్యూటర్ సైన్స్ తో పాటు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ విభాగాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి, కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.నిద్యా, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :