నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 10 : వి బి జి రాంజీ ఉపాధి పనులలో భాగంగా కూలీలు చేపట్టిన నీటి సంరక్షణ లో సప్లై ఛానల్ పనులు ఆదర్శవంతంగా నిలుస్తాయని అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ప్రశంసించారు. గురువారం మండలంలోని కోటకొండ లో విబిజి రామ్జీ ఉపాధి పనులలో భాగంగా చేపట్టిన చెరువు సప్లై ఛానల్ పనులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి పనులలో ప్రతి చెరువులో సప్లై చానల్స్ పనులు చేపట్టి ప్రతి నీటి బొట్టు వృధా కాకుండా నీటి సంరక్షణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఇదే స్ఫూర్తితో మండలంలోని చెరువులు, కుంటలు, చెక్ డ్యాముల పరిధిలోని సప్లై చానల్స్ పనులు చేపట్టి భవిష్యత్తులో నీటి సంరక్షణ ధ్యేయంగా పనులు చేయాలన్నారు. అదేవిధంగా పండ్ల తోటల పెంపకం తో నీటి ఆదాతో పాటు అధిక దిగుబడులకు రైతులకు సహకరించాలన్నారు. చెరువుల్లో ఫారం పాండ్స్ నిర్మాణాలపై దృష్టి సారించి పశుగ్రాస కొరత తీర్చడానికి పాడి రైతులకు పశుగ్రాస పెంపకానికి రైతులను ప్రోత్సహించాలన్నారు. వి బి జి రాంజీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించి వలసల నివారణకు సహకరించాలన్నారు. ఆయన వెంట ఏ పి ఓ అంజనప్ప, ఎంటిసీ లక్ష్మీనారాయణ, టెక్నికల్ అసిస్టెంట్ సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీదేవి ఉపాధి కూలీలు పాల్గొన్నారు
Reporter
Namitha News