Tuesday, 14 April 2026 05:29:44 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎస్పీ

Date : 13 April 2026 10:17 PM Views : 36

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 13: మదనపల్లె పోలీస్ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బి.పావని సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2023 వ బ్యాచ్ లో నేరుగా డీఎస్పీ గా ఎంపికైన ఆమెకు ఇదితొలి పోస్టింగ్. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆమె మదనపల్లి లోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారిని, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారికి పూలమొక్కను అందజేసి విధుల్లో చేరినట్లు నివేదించిన డీఎస్పీకి ఎస్పీ గారు శుభాకాంక్షలు తెలుపుతూ, సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు. మదనపల్లె పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన ట్రాఫిక్ రద్దీపై ఎస్పీ గారు ప్రత్యేకంగా చర్చించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. అక్రమ పార్కింగ్, రహదారుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పించాలి. డీఎస్పీగా తొలి బాధ్యతలే మదనపల్లె వంటి కీలక డివిజన్‌లో రావడం శుభపరిణామమని, శక్తివంచన లేకుండా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్, సైబర్ నేరాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం గస్తీ పెంచాలని, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. బాధితులు ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేలా సిబ్బంది పనితీరు ఉండాలని, తక్షణ న్యాయమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అనంతరం డిఎస్పీ గారు జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె పట్టణ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడబోనని ఆమె పేర్కొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :