నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె పట్టణం లో ని జడ్పీహైస్కూలులో ఇంటర్ నేషనల్ యోగ దినోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్... యోగాంధ్రా 2026 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ , జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ , సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి , మునిసిపల్ కమీషనర్ ప్రమీల ముఖ్య అథిధులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు . మొదటగా యోగాంధ్ర కార్యక్రమాన్ని మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు . సాంస్కృతిక కార్యక్రమాలు,యోగ విన్యాసాలతో చిన్నారులు అందరిని అలరించారు . నేడు అనగా 08. 06 . 2026 న జిల్లా వారీ నేపథ్య యోగా 2026 అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలు , హెల్త్ వర్కర్ల నడుమ ఈ యోగాంధ్ర 2026 నిర్వహించడం జరిగినది . చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సమయ పాలనా గురుంచి అవగాహన కలిగిన నృత్యాలు చేసి అందరింని అలరించారు.జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా బహుమతిని అందుకుని అందరి ప్రశంసలను పొందారు. మన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లె మండలం లోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులు ప్రతీ కార్యక్రమానికి హాజరై సంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్న పిల్లలకు తర్ఫీదు ఇచ్చిన చైతన్య స్వచ్చంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ. కవిత రాణి కొనియాడారు . ఈ కార్యక్రమం నందు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ , జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ , సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి , మునిసిపల్ కమీషనర్ ప్రమీల , చైతన్య స్వచ్చంద సేవా సంస్థ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు .
Reporter
Namitha News