నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 26 : శ్రీరాముని ఆదర్శాలను స్మరించుకుంటూ.. ధర్మం, న్యాయం, ప్రేమ, కరుణ ఆయన జీవితంలోని ముఖ్యమైన అంశాలు. వీటిని మన జీవితాల్లో ఆచరించాలని, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. ప్రజలందరూ శాంతియుతంగా, సంతోషంగా, శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ పోలీసులకు సహకరించాలని, "మీ భద్రత మాకు ముఖ్యం" కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. మీ పరిధిలో మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పకుండా అనుమతి తీసుకోవాలి. ఇది మీ భద్రతకు, అలాగే ఆ ప్రాంతంలోని ప్రజలందరి భద్రతకు చాలా ముఖ్యం. మీరు అనుమతి తీసుకోవడం ద్వారా పోలీసులు ఆ కార్యక్రమం గురించి తెలుసుకుంటారని, అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారని, తద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించగలుగుతారని, కాబట్టి ఏదైనా కార్యక్రమం నిర్వహించేముందు పోలీసుల అనుమతి తీసుకోవడం బాధ్యతాయుతమైన పౌరులుగా మీ కర్తవ్యం అని ఎస్పీ గారు తెలిపారు. ప్రజలందరూ శాంతియుతంగా సంతోషంగా శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలని, అత్యవసరం అయితే వెంటనే స్తానిక పోలీస్ స్టేషన్ లేదా 112 నెంబర్ కు డయల్ చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పండుగ సందర్భంగా.. డీజే లాంటి కార్యక్రమాలను నిర్వహించరాదని, సాంప్రదాయ పద్ధతిలో పండుగ జరుపుకోవాలని, మైనర్లకు బైకులు ఇచ్చిన తల్లిదండ్రులు సంరక్షకుల పై కేసులు నమోదు చేయాలని, ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ.. సైలెన్సర్లు తీసివేసి బైకులు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు
జిల్లా ప్రజలందరికీ పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు
Reporter
Namitha News